భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ కరోనా పాజిటివ్ కేసులు రెండు లక్షల 50వేలకు చేరువలో నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,47,417 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 380 మంది కరోనా కారణంగా మృతి చెందారు.దీంతో కరోనా మరణాల సంఖ్య 4,85,035కు చేరింది. ఇక కోవిడ్ నుంచి 24 గంటల్లో84,825 కరోనా పేషంట్లు రికవరీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 11,17,531 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 13.11% శాతంగా ఉంది. ఇక భారత్ లో ఒమిక్రాన్ కేసులు 5,488గా ఉన్నాయి. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. పలు నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు.
India reports 2,47,417 fresh COVID cases (27% higher than yesterday) and 84,825 recoveries in the last 24 hours
— ANI (@ANI) January 13, 2022
Active case: 11,17,531
Daily positivity rate: 13.11%
Confirmed cases of Omicron: 5,488 pic.twitter.com/kSvYNqJHb2