భారత్ లో తగ్గిన కరోనా కేసులు

భారత్ లో తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు తగ్గాయి.  నిన్నటిలాగే ఇవాళ కూడా రెండు లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2 లక్షల 85వేల 914 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా కారణంగా 665 మంది చనిపోయారు. కరోనా నుంచి గత 24 గంటల్లో రెండు లక్షల 99వేల 73 మంది విజయవంతంగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 22 లక్సల 23వేల 18 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 16.16 శాతంగా ఉంది. మరోవైపు భారత్ లో ఇప్పటి వరకు 1,63,58,44,536 మందికి వ్యాక్సినేన్ పూర్తయ్యింది. నిన్న దేశ వ్యాప్తంగా 2,55,874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా ఐదారు రోజుల తర్వాత మూడు లక్షల దిగువన కేసులు నమోదవుతున్నాయి.