భారత్ లో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. గత మూడు రోజులుగా కేసుల సంఖ్య రెండు లక్షలకు పైగానే నమోదు అవుతోంది. అయితే నిన్నటితో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,86,384 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి 573 మంది మరణించారు. ఇక 24 గంటల్లో కరోనా నుంచి 3,06,357 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 22,02,472 పాజిటివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 19.59 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకు భారత్ లో 1,63,84,39,207 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.
India reports 2,86,384 new #COVID19 cases, 573 deaths and 3,06,357 recoveries in the last 24 hours
— ANI (@ANI) January 27, 2022
Active case: 22,02,472 (5.46%)
Daily positivity rate: 19.59%
Total Vaccination : 1,63,84,39,207 pic.twitter.com/NKqlGIVaD6