భారత్ లో కరోనా విజృంభణ.. ఒకే రోజు 90వేల కేసులు

భారత్ లో కరోనా విజృంభణ.. ఒకే రోజు 90వేల కేసులు

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 90928 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య 56.6శాతం పెరిగింది. ఇక మరో 324 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 19206 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరోవైపు ఒమిక్రాన్ టెన్షన్ కూడా దేశ ప్రజల్ని వణికిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 285401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు  4,82,876 మంది చనిపోయారు. ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పటివరకు 148.67 కోట్ల టీకా డోసుల పంపిణీ  పూర్తయ్యింది.