దేశంలో 4 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో 4 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈ ఒక్క రోజులో లక్షా 79 వేల 723 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో మహారాష్ట్ర నుంచే 44 వేల 388, యూపీలో 7 వేల 695, ఢిల్లీలో 27 వేల 75 కేసులు ఉన్నాయి. నిన్నటి కంటే 12.5 శాతం కేసులు పెరిగాయి. డైలీ పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. ఆదివారం 146 మంది వైరస్ కారణంగా చనిపోగా.. 46 వేల 569 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 7లక్షల 23వేల 619 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు 4 వేల మార్క్ దాటాయి. తాజాగా 4,033 కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు భారీగా తగ్గడం కాస్త ఊరట కలిగిస్తోంది. కేసులు పెరుగుతున్నా వైరస్ తీవ్రత తక్కువగానే ఉందంటున్నారు నిపుణులు. అలా అని నిర్లక్ష్యం చేయొద్దని.. మస్ట్‎గా కరోనా రూల్స్ పాటిస్తూ ఉండాలన్నారు. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా టెస్టు చేయించుకోవాలని అధికారులు అంటున్నారు.

For More News..

దేశవ్యాప్తంగా మొదలైన బూస్టర్ డోసుల పంపిణీ

ప్లేట్​ దోసె 2, ఇడ్లీ 3, ఊతప్పం 4 రూపాయలు

న్యూఇయర్‌‌‌‌ కోసం ఓయోలో భారీగా రూమ్ బుకింగ్స్