మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా చేరుకున్న టీమిండియా అప్పుడే ట్రెయినింగ్ స్టార్ట్ చేసింది. తేలికపాటి ఎక్స్ర్సైజుల అనంతరం ప్లేయర్లంతా నెట్ ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా ప్లేయర్లంతా పాల్గొన్న ఈ సెషన్కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పెట్టింది. కోహ్లీ, అజింక్యా రహానె, చతేశ్వర్ పుజారా , హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా అశ్విన్, బుమ్రా, సిరాజ్, ఉమేశ్ తదితరులు వాళ్లకి బౌలింగ్ చేశారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సెషన్ మొత్తాన్ని పర్యవేక్షించాడు. అంతకుముందు టీమిండియా మొత్తం ఓ తేలికపాటి వామప్ సెషన్లో పార్టిసిపేట్ చేసింది. ముంబైలో మూడు రోజుల హార్డ్ క్వారంటైన్ తర్వాత చార్టెడ్ ఫ్లైట్లో జోహనెస్బర్గ్ వెళ్లిన కోహ్లీసేన అక్కడ ఒక రోజు మొత్తం ఐసోలేషన్లో ఉంది. శనివారం ఉదయం ఇక్కడి ఓ రిసార్ట్లో ట్రెయినింగ్ స్టార్ట్ చేసింది. వామప్, తేలికపాటి ఎక్స్ర్సైజ్ల అనంతరం అందరు కలిసి ఫుట్వాలీ గేమ్ ఆడి బాడీని యాక్షన్కు రెడీ చేశారు. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ కోహ్లీ సహా టీమ్ మెంబర్స్ అంతా రెండు గ్రూపులుగా విడిపోయి ఫుట్వాలీ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. అయితే ఫుట్వాలీ గేమ్ను జట్టు మొత్తం ఎంజాయ్ చేసిందని స్ట్రెంథ్ అండ్ కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ పేర్కొన్నాడు. ‘మేమంతా ముంబైలో మూడు రోజులు క్వారంటైన్లో ఉన్నాం. ఆ తర్వాత పది గంటల పాటు ఫ్లైట్ జర్నీ చేశాం. ఇక్కడికి చేరిన తర్వాత మరో రోజు హార్డ్ క్వారంటైన్లో ఉన్నాం. అందువల్ల పూర్తి స్థాయి ట్రెయినింగ్ సెషన్స్ అప్పుడే మొదలుపెట్టడం ప్లేయర్లకు రిస్క్. మేము సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఉన్నాం. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు రెండు లేదా మూడు రోజులు పడుతుంది. ఫుట్వాలీని అందరు ఎంజాయ్ చేశారు. ఏం ఆడాలనే దానిపై మేము చాలా సేపు చర్చించి ఈ గేమ్ ఆడాం. ఫుట్వాలీ ఇకపై టీమిండియా గేమ్గా మారుతుంది. ప్లేయర్లు సంతోషంగా ఉండటానికి, వాళ్ల ఫోకస్ పెంచడానికి ఈ గేమ్ బాగా హెల్ప్ అవుతోంది’ అని సోహమ్ దేశాయ్ అన్నాడు. ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో కోహ్లీ సేన కోసం సౌతాఫ్రికా బోర్డు ఓ రిసార్ట్ను బుక్ చేసింది. టీమ్ మెంబర్స్ అంతా అక్కడే ఉంటున్నారు. 26న ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఫస్ట్ టెస్ట్ ప్రారంభమవుతుంది.
ఈనెల 26న ఇండియా, సౌతాఫ్రికా ఫస్ట్ టెస్ట్
- ఆట
- December 19, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ముస్లిం, హిందూ భార్యభర్తలపై చార్మినార్ లో వేధింపులు: పోలీస్ కేసు
- ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు.. మార్చి 30ఏ లాస్ట్ డే
- V6 DIGITAL 28.03.2024 EVENING EDITION
- RR vs DC: తొలి గెలుపే లక్ష్యంగా: ఢిల్లీ జట్టులో చేరిన సౌతాఫ్రికా స్టార్ బౌలర్
- Hansika 105 Minutes OTT: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన..హన్సిక సస్పెన్స్ థ్రిల్లర్ 105 మినిట్స్
- Ram Charan,Prabhas: ఫ్యాన్స్ అంటే మీరేనబ్బా.. చరణ్ పుట్టినరోజున ప్రభాస్ ఫ్యాన్స్ అన్నదానం
- టాలెంట్ తొక్కేస్తారా..? : మెట్రో రైలులో హోలీ వీడియో చేసిన అమ్మాయిలు అరెస్ట్
- ఫోన్ ట్యాపింగ్ పై పూర్తి విచారణ చేయాలి : డీజీపీకి కాంగ్రెస్ లీడర్స్ కంప్లయింట్
- Weather update: భానుడి భగభగలు.. తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
- SRH vs MI: వారెవ్వా ఉప్పల్ మ్యాచ్.. ఒక్క మ్యాచ్తో నాలుగు ఆల్టైం రికార్డ్స్ బ్రేక్
Most Read News
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా రిలీజ్
- Jaggi Vasudev: సద్గురు వాసుదేవ్ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్
- SRH vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఉత్కంఠ పోరులో గెలిచిన సన్ రైజర్స్