ఇవాళ సౌతాఫ్రికాతో ఇండియా టీ20 ట్రై సిరీస్​ ఫైనల్​

ఇవాళ సౌతాఫ్రికాతో ఇండియా టీ20 ట్రై సిరీస్​ ఫైనల్​

సా.6.30 నుంచి స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌లో

ఈస్ట్​ లండన్​: టీ20 వరల్డ్​కప్​కు కొన్ని రోజులే మిగిలి ఉన్న వేళ.. ఇండియా విమెన్స్​ టీమ్ తమ​ ప్రిపరేషన్స్​ను విజయంతో ముగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం సౌతాఫ్రికాతో జరిగే టీ20 ట్రై సిరీస్ ఫైనల్లో టైటిల్​ నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొన్న ఆస్ట్రేలియాపై 1–4తో సిరీస్​ను చేజార్చుకున్నా.. ట్రై సిరీస్​లో టీమిండియా ఆట మెరుగైంది. మూడు విజయాలతో ఫైనల్​కు దూసుకొచ్చింది. దీంతో అదే జోరునూ సఫారీలపై కొనసాగించాలని భావిస్తోంది.