
సా.6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో
ఈస్ట్ లండన్: టీ20 వరల్డ్కప్కు కొన్ని రోజులే మిగిలి ఉన్న వేళ.. ఇండియా విమెన్స్ టీమ్ తమ ప్రిపరేషన్స్ను విజయంతో ముగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం సౌతాఫ్రికాతో జరిగే టీ20 ట్రై సిరీస్ ఫైనల్లో టైటిల్ నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొన్న ఆస్ట్రేలియాపై 1–4తో సిరీస్ను చేజార్చుకున్నా.. ట్రై సిరీస్లో టీమిండియా ఆట మెరుగైంది. మూడు విజయాలతో ఫైనల్కు దూసుకొచ్చింది. దీంతో అదే జోరునూ సఫారీలపై కొనసాగించాలని భావిస్తోంది.