న్యూఢిల్లీ: వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వెస్టిండీస్ -ఇండియా మధ్య జరిగే సిరీస్ కాస్త ఆలస్యంగా మొదలవనుంది. ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ ప్రకారం టీమిండియా జూలైలోనే వెస్టిండీస్ టూర్కు వెళ్లాల్సి ఉంది. కానీ, వరల్డ్కప్ పూర్తయిన తర్వాత ఇండియా ప్లేయర్లకు కొంత విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావించింది. ఇదే విషయాన్ని వెస్టిండీస్ బోర్డు (సీడబ్ల్యూఐ)కు చెప్పి రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల టూర్ను రెండు వారాలు వెనక్కు జరపాలని కోరింది. దీనికి సీడబ్ల్యూఐ ఒప్పుకుంది. దాంతో, ఈ టూర్ ఆగస్టు తొలి వారంలో మొదలై సెప్టెంబర్ 4న ముగిసే అవకాశం ఉంది. మ్యాచ్లు జరిగే తేదీలు, వేదికల వివరాలను మే 13న జరిగే తమ బోర్డ్ మీటింగ్లో సీడబ్ల్యూఐ వెల్లడించనుంది.