న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టీ20లో రోహిత్ శర్మ చెలరేగాడు. 40 బంతుల్లో(3 సిక్సులు,6 ఫోర్లు) 65 రన్స్ తో విజృంభించాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కు 180 పరుగుల టార్గెట్ ఫిక్స్ చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు మంచి ఓపెనింగ్ దక్కింది. రోహిత్ శర్మ 65 రన్స్ తో చెలరేగగా మరో ఓపెనర్ రాహుల్ 27 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన శివమ్ ధూబె 3,వీరాట్ కోహ్లీ 38,శ్రేయాస్ అయ్యార్ 17, మనీష్ పాండే 14(నాటౌట్) ,జడేజా 10(నాటౌట్) చేశారు. దీంతో టీమిండియా 179 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్నెట్ కు మూడు వికెట్లు, మిచ్చెల్ సన్టర్ ,గ్రండోమ కు తలో ఒక వికెట్ పడ్డాయి.
see more news