IND vs SL : టాస్‌ గెలిచిన భారత్‌

IND vs SL :  టాస్‌ గెలిచిన భారత్‌

పుణె వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య  ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక ముందుగా బ్యాటింగ్‌ చేయనుంది. ఈ మ్యాచ్‌తో భారత క్రికెటర్‌ రాహుల్‌ త్రిపాఠి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇప్పటికే ఫస్ట్ టీ20 మ్యాచ్  గెలిచిన టీమిండియా రెండో టీ20లో కూడా  గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అటు స్వల్ప స్కోర్ తేడాతో  ఫస్ట్ టీ20 మ్యాచ్ లో ఓడిన లంక జట్టు ఈ మ్యాచ్ లో గెలవాలని తహతహలాడుతోంది. 


భార‌త్ : ఇషాన్ కిష‌న్ (వికెట్ కీప‌ర్‌), శుభ్‌మ‌న్ గిల్, సూర్యకుమార్ యాద‌వ్‌, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌),, దీప‌క్ హుడా, అక్షర్ ప‌టేల్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్‌, అర్షదీప్ సింగ్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌.
 

శ్రీలంక : ప్రథుమ్ నిస్సంకా, కుశాల్ మెండిస్ (వికెట్ కీప‌ర్‌), ధ‌నంజ‌య డిసిల్వా, చ‌రిత అస‌లంక‌, భానుక రాజ‌ప‌క్సే, ద‌సున్ శ‌న‌క (కెప్టెన్‌), వ‌నిందు హ‌స‌రంగ‌, చ‌మిక క‌రుణ‌ర‌త్నే, మ‌హీష్ థీక్షణ‌, క‌సున్ ర‌జిత‌, దిల్షాన్ మ‌ధుశ‌న‌క‌.