భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో ఇండియాకు సాయం అందించేందుకు పలు దేశాలు ముందుకు వచ్చాయి. అందులో భాగంగా బ్రిటన్ పంపిన మరో 1200 ఆక్సిజన్ సిలిండర్లు భారత్కు ఇవాళ( గురువారం) చేరుకున్నాయి. ఈ ఆక్సిజన్ సిలిండ్లరు భారత్కు సరఫరా చేసేందుకు సహకరించిన ఖతర్ ఎయిర్ వేస్కు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిండమ్ బగ్చి కృతజ్ఞతలు తెలిపారు.
సోమవారం బ్రిటీష్ కంపెనీ 1350 ఆక్సిజన్ సిలిండర్లను ఇండియాకు పంపింది. కరోనా పోరులో భాగంగా భారత్కు ప్రపంచ దేశాలు మద్దతు తెలుపుతూ..సాయం అందిస్తున్నాయి. ఆరోగ్య మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న భారత్కు మెడికల్ పరికరాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, పిపిఇ కిట్లు, మెడికల్ సాయం అందిస్తామని హామీనిచ్చాయి.