
హిమాచల్ ప్రదేశ్: న్యూజిలాండ్ తో వరుస ఓటమిల తర్వాత జరిగే సౌతాఫ్రికా వన్డే సిరీస్ పై కన్నేసింది భారత్. ఈ సిరీస్ ను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది కోహ్లీ సేన. ఈ క్రమంలోనే భారత క్రికెటర్లు ధర్మశాల స్టేడియంలో గట్టిగా ప్రాక్టీసు చేస్తున్నారు. మంగళవారం కెప్టెన్ విరాట్ కోహ్లి సహా టీమ్ ఆటగాళ్లంతా ప్రాక్టీస్ లో పాల్గొన్నారు.
టీమిండియా సొంత గడ్డపై సౌతాఫ్రికాతో 3 వన్డేల సిరీస్ ఆడనున్నది. ఫస్ట్ వన్డే మార్చి 12న ధర్మశాలలో జరుగనుంది. 15న లక్నోలో రెండో వన్డే, మూడో వన్డే 18న కలకత్తాలో జరగనున్నాయి. ఈ 3 మ్యాచ్ లు డే-నైట్ మ్యాచ్లే. మధ్యాహ్నం 1-30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
See Also: రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ముగిసిన విచారణ
Himachal Pradesh: Indian Cricket team practice ahead of 3-match ODI series against South Africa. The 1st ODI match is scheduled for 12th March in Dharamshala. #IndvsSA pic.twitter.com/MuC79MYyYW
— ANI (@ANI) March 10, 2020