భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ

భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొనడంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. పలు దేశాలు తమ దేశ పౌరులను వెనక్కి వచ్చేయాలని సూచించాయి. తాజాగా ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ సైతం భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు వెంటనే ఉక్రెయిన్ ను విడిచి వెట్టాలని ప్రకటించింది. కమర్షియల్, చార్టర్డ్ ఫ్లైట్లు అందుబాటులో ఉంటే వెంటనే అక్కడి నుంచి వచ్చేయాలని సూచించింది. ఉక్రెయిన్ లో చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్లు సైతం ఉక్రెయిన్ ను విడిచి వెళ్లాలని భారత ఎంబసీ ట్వీట్ చేసింది. స్టూడెంట్ కాంట్రాక్టర్లతో టచ్ లో ఉంటూ ఫైట్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, అప్ డేట్ల కోసం ఇండియన్ ఎంబసీ వెబ్ సైట్, ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లను ఫాలో కావాలని సూచించింది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు ఎలాంటి సమాచారం, సాయం కోసమైనా విదేశాంగ శాఖను సంప్రదించవచ్చని, ఇందుకోసం 24గంటలు పనిచేసేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు చెప్పింది. 

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న భారతీయుల వివరాలను ఇండియన్ ఎంబసీ సేకరిస్తోంది. ఉక్రెయిన్లో దాదాపు 18వేల మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఎన్నారైల కోసం ఎయిరిండియా ప్రత్యేక ఫ్లైట్లు నడపాలని నిర్ణయించింది. 22,24,26 తేదీల్లో ప్రత్యేక విమానాలు నడిపేందుకు సిద్ధమైంది. 

For more news

శరద్ ప‌వార్‌తో కేసీఆర్ భేటీ

నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేస్తుండు