ముంబై : ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబైలో భేటీ అయ్యారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సమావేశం అనంతరం కేసీఆర్ నేరుగా శరద్ పవార్ నివాసానికి వెళ్లారు. ఎన్సీపీ చీఫ్ తో దేశ రాజకీయాలపై సీఎం చర్చిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. ఈ భేటీ ముగిసిన అనంతరం సీఎం హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. పవార్తో భేటీ కంటే ముందు ఉద్ధవ్ థాక్రేతో సమావేశమైన కేసీఆర్ దేశ రాజకీయాలపై చర్చించారు.
మరిన్ని వార్తల కోసం..
ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎఫ్ఐఆర్
'కళావతి’ పాటకు సితార స్టెప్పులు