న్యూజెర్సీలో కొత్త ఇంటి స్విమ్మింగ్ పూల్ లో పడి భారత కుటుంబం మృతి

న్యూజెర్సీలో కొత్త ఇంటి స్విమ్మింగ్ పూల్ లో పడి భారత కుటుంబం మృతి

అమెరికాలో ఘోరం జరిగింది. ఇంట్లోని స్విమ్మింగ్ పూల్ లో పడి భారత్ కు చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన న్యూజెర్సీలో చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన భారత్ పటేల్ (62), అతని 33 ఏళ్ల కోడలు నిషా పటేల్ మరియు ఆమె 8 ఏళ్ల కుమార్తె న్యూజెర్సీలో నివసిస్తున్నారు. క్లీయర్‌వ్యూ రోడ్‌లోని వీరు ఉంటున్న ఇళ్లు ఈ ఏడాది ఏప్రిల్ లోనే 4,51000 డాలర్లకు కొనుగోలు చేశారు. ఆ ఇంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ మిగతా స్విమ్మింగ్ పూల్స్ కు కొంచెం భిన్నంగా ఉంటుంది. అంతేగాక.. కొంచెం లోతు కూడా ఎక్కువగా ఉంటుంది. పటేల్ కుటుంబం సోమవారం ఈత కొట్టడానికి పూల్ లోకి దిగారు. అయితే పూల్ లో మునిగిపోయారో లేక షాక్ కొట్టిందో తెలియదు కానీ.. వీరంతా చనిపోయారు. ఈ ముగ్గురు ఎలా చనిపోయారన్న దానిపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిషా అరుపులు విన్న పక్కింటి వాళ్లు పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. పటేల్ ఫ్యామిలీకి సీపీఆర్ చేశారు. కానీ, అప్పటికే ముగ్గురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన పట్ల న్యూజెర్సీ మేయర్ బ్రాడ్ కోహెన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

For More News..

రష్యా విక్టరీ డే పరేడ్ లో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్