యూకేలో భారత సంతతి వ్యక్తి హత్య

యూకేలో భారత సంతతి వ్యక్తి హత్య

లండన్: భారత సంతతికి చెందిన 38 ఏండ్ల అరవింద్ శశికుమార్​ శుక్రవారం లండన్​లో హత్యకు గురయ్యాడు. కత్తిపోట్ల గాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న శశికుమార్​ను ఈ నెల 16న సౌథాంప్టన్​ వే, కాంబర్వెల్​లో గుర్తించామని పోలీసులు తెలిపారు.

శశికుమార్​కు వైద్య సహాయం అందించినా కోలుకోలేకపోయాడని,​ శుక్రవారం తెల్లవారుజామున 1:31 గంటలకు మరణించాడని తెలిపారు. జూన్​17న సల్మాన్​ సలీం(25) అనే యువకుడిని హత్యారోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఛాతీలో కత్తితో  పొడవటం కారణంగానే శశికుమార్​ చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో  వైద్యులు తెలిపారు.