లండన్: భారత సంతతికి చెందిన 38 ఏండ్ల అరవింద్ శశికుమార్ శుక్రవారం లండన్లో హత్యకు గురయ్యాడు. కత్తిపోట్ల గాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న శశికుమార్ను ఈ నెల 16న సౌథాంప్టన్ వే, కాంబర్వెల్లో గుర్తించామని పోలీసులు తెలిపారు.
శశికుమార్కు వైద్య సహాయం అందించినా కోలుకోలేకపోయాడని, శుక్రవారం తెల్లవారుజామున 1:31 గంటలకు మరణించాడని తెలిపారు. జూన్17న సల్మాన్ సలీం(25) అనే యువకుడిని హత్యారోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఛాతీలో కత్తితో పొడవటం కారణంగానే శశికుమార్ చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు తెలిపారు.