మే -12 నుంచి ప్ర‌యాణికుల రైళ్లు

మే -12 నుంచి ప్ర‌యాణికుల రైళ్లు

న్యూఢిల్లీ: మే-12 నుంచి ప్ర‌యాణికుల రైళ్లు న‌డ‌ప‌నున్న‌ట్లు ఆదివారం అనౌన్స్ చేసింది రైల్వేశాఖ‌. ప్ర‌స్తుతానికి 15 రైళ్లు న‌డుపుతామ‌ని.. ఢిల్లీ నుంచి దిబ్రూగ‌ఢ్, అగ‌ర్త‌లా, హౌరా, పాట్నా, బిలాస్ పూర్, రాంచీ, భువ‌నేశ్వ‌ర్, సికింద్రాబాద్, బెంగ‌ళూరు, చెన్నై, తిరువ‌నంత‌పురం, మ‌డ్గావ్, ముంబై సెంట్ర‌ల్, అహ్మ‌దాబాద్, జ‌మ్మూతావీల‌కు ఈ రైళ్లు వెళ్తాయ‌ని తెలిపింది. ఈ రైళ్ల‌కు రేప‌టి నుంచి రిజ‌ర్వేష‌న్లు ప్రారంభం కానుండ‌గా..త్వ‌ర‌లో కోచ్ ల‌ను బ‌ట్టి మిగ‌తా రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు తెలిపింది రైల్వే.