దసరా, దీపావళి పండుగల సీజన్: మరో 392 స్పెషల్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్

దసరా, దీపావళి పండుగల సీజన్: మరో 392 స్పెషల్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్

కరోనా లాక్‌డౌన్‌తో అతి కొద్ది సంఖ్యలో మాత్రమే ట్రైన్స్ నడుపుతున్న రైల్వే శాఖ.. దసరా, దీపావళి వంటి పండుగలు వస్తుండడంతో మరిన్ని స్పెషల్ రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు అదనంగా మరో 196 రూట్లలో 392 ట్రైన్లను నడపబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్లు అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 మధ్య మాత్రమే నడుస్తాయని తెలిపింది. దసరా నవరాత్రులతో పాటు దీపావళి, ఉత్తరాదిన ప్రత్యేకంగా జరిగే ఛట్ పూజ లాంటి పండుగలు వరుసగా ఉండడంతో ప్రయాణికుల రద్దీ పెరిగే చాన్స్ ఉందని ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు తెలిపింది. సికింద్రాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, చెన్నై, మధురై, తిరువనంతపురం, కన్యాకుమారి, కోల్‌కతా, పాట్నా, వారణాసి, లక్నో, గయ, జైపూర్, పూరీ, భువనేశ్వర్ సహా పలు స్టేషన్ల నుంచి ఈ స్పెషల్ ట్రైన్లు నడుస్తాయని రైల్వే శాఖ చెప్పింది.

స్పెషల్ ట్రైన్ల లిస్ట్: festivaltrains2020