నేపాల్‌లోని మనోళ్లకు కరోనా

నేపాల్‌లోని మనోళ్లకు కరోనా
  •  మతపరమైన ప్రార్థనలకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులకు పాజిటివ్‌
  • క్వారంటైన్‌లో 26 మంది

ఖాట్మాండూ: మతపరమైన ప్రార్థనల్లో పాల్గొనేందుకు మన దేశం నుంచి నేపాల్‌ వెళ్లిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఖాట్మాండూకు 135 కిలోమీటర్ల దూరం ఉన్న బిర్‌‌గుంజ్‌ సిటీలో మార్చిలో మతపరమైన ప్రార్థనలు జరిగాయి. నేపాల్‌, ఇండియాకు చెందిన చాలా మంది ఆ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అనూహ్యంగా లాక్‌డౌన్‌ విధించడంతో కొంత మంది అక్కడే ఇరుక్కుపోయారు. వారంతా లోకల్‌గా ఒక మసీదులో ఉంటున్నారు. వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని నేపాల్‌ అధికారులు ఆదివారం ప్రకటించారు. మసీదులో వారితో పాటు ఉంటున్న 26 మందిని క్వారంటైన్‌కు తరలించామని చెప్పారు.