న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ ప్రొడక్షన్కు బూస్ట్ ఇచ్చేందుకు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ విస్ట్రన్తో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. మొబైల్ డివైస్లు, టెలికం గేర్ల ప్రొడక్షన్ పెంచేందుకు రూ. 1,350 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఆప్టిమస్ వెల్లడించింది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో రూ. 38 వేల కోట్ల రెవెన్యూను టార్గెట్గా పెట్టుకుంటున్నామని, కొత్తగా 11 వేల ఉద్యోగాలు క్రియేట్ చేయాలనుకుంటున్నామని ఆప్టిమస్ చైర్మన్ అశోక్ కుమార్ గుప్తా చెప్పారు. పీఎల్ఐ స్కీము కింద అర్హత పొందిన కంపెనీలలో ఆప్టిమస్ కూడా ఒకటి. గ్రోత్తో పాటే ఇన్వెస్ట్మెంట్ పెంచుతామని గుప్తా పేర్కొన్నారు. ఉత్తర్ప్రదేశ్లోని నోయిడా వద్ద కంపెనీకి రెండు మాన్యుఫాక్చరింగ్ యూనిట్లున్నాయి. వీటికి నెలకు 20 లక్షల మొబైల్ డివైస్లు ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంది. ఎలక్ట్రానిక్స్కు డిమాండ్ పెరుగుతోందని, పీఎల్ఐ స్కీముతో దేశంలో తయారీ జోరందుకుంటుందని గుప్తా పేర్కొన్నారు. 5 జీ మొబైల్స్, ఐటీ హార్డ్వేర్ నోట్బుక్, డెస్క్టాప్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలలో ఇండియాకు మంచి అవకాశాలున్నాయని విస్ట్రన్ ప్రెసిడెంట్ డేవిడ్ చెన్ చెప్పారు. ఎలక్ట్రానిక్ వెహికల్ తయారీ రంగంలోకి త్వరలో అడుగుపెట్టనున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఐఓటీలోకి ప్రవేశిస్తామని పేర్కొన్నారు. ప్రొడక్ట్ డెవలప్మెంట్లోనూ ఆప్టిమస్, విస్ట్రన్ కంపెనీలు కలిసి పనిచేయనున్నాయి.