హరీశ్‌రావు రాజీనామాతో కొత్త డ్రామాకు తెర తీసిండు : బల్మూరి వెంకట్

హరీశ్‌రావు రాజీనామాతో కొత్త డ్రామాకు తెర తీసిండు :  బల్మూరి వెంకట్

తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి మలినం చేశారని విమర్శించారు  ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. హరీష్ రావు అమరుల స్తూపాన్ని అపవిత్రం చేశారని పసుపు నీళ్లతో శుద్ధి చేశారాయన.  ఆగస్టు 15 లోగా రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని అన్నారు.  రుణమాఫీ అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని సవాలు విసిరితే... హరీష్ రావు తన రాజీనామా తో కొత్త డ్రామాకు తెర తీశారని మండిపడ్డారు.  రూ. 2లక్షల రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు  బల్మూరి వెంకట్. ఆగస్టు 15 లోపు ఇచ్చిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తామని చెప్పారు. తాను బాధ్యత తీసుకొని హరీష్ రావు రాజీనామాను ఆమోదించేలా చూస్తానన్నారు బల్మూరి వెంకట్.  

Also Read:సెమీ ఫైనల్లో కేసీఆర్ ని ఓడించాం... ఫైనల్లో బీజేపీని బొందపెట్టాలె