హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో వీల్స్ లో పొగలు వచ్చాయి. పొగలు రావడాన్ని గమనించిన పైలట్ అలర్టైయ్యాడు. వెంటనే విమానాశ్రయం అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలో ఉన్న 155 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.