ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ

ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ

వికారాబాద్, వెలుగు: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం మోమిన్​పేట, మర్పల్లి మండలాలకు సంబంధించి575 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, 27 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు కొండల్​రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సదానందం, ఎంపీడీఓ విజయ లక్ష్మి, తహసీల్దార్ రవీందర్ పాల్గొన్నారు.