
తాడ్వాయి, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేయనున్నదని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రేగ కల్యాణి అన్నారు. శుక్రవారం తాడ్వాయి మండల కేంద్రంతో పాటు కామారంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు తహసీల్దార్ సురేశ్ బాబు, ఎంపీడీవో సుమనవణితో కలిసి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ఆరోపాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శులు రమేశ్, రాజశేఖర్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.