ఇండో‑పాక్‌‌‌‌‌‌‌‌‌‌ టికెట్లు ధర రూ. 1.84 కోట్లు!

ఇండో‑పాక్‌‌‌‌‌‌‌‌‌‌ టికెట్లు ధర రూ. 1.84 కోట్లు!

న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు క్రేజ్‌‌‌‌ ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైంది. టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో భాగంగా జూన్‌‌‌‌ 9న జరిగే ఇండో–పాక్‌‌‌‌ మ్యాచ్‌‌ టికెట్ల ధర ఆకాశాన్ని తాకుతోంది. ఈ టిక్కెట్లను అధికారికంగా 6 డాలర్ల (రూ. 497) నుంచి 400 డాలర్ల (రూ. 33 వేలు) ధరకు విక్రయించారు. గత నెల 22న ఐసీసీ అధికారిక వెబ్‌‌‌‌సైట్లలో టికెట్లను ఉంచిన క్షణాల్లో అన్నీ అమ్ముడుపోయాయి.  

కానీ ఇప్పుడు పలు రీసేల్‌‌‌‌ సైట్లలో వీటిని రూ. 33 లక్షల నుంచి ఏకంగా రూ. 1.84 కోట్లు (ట్యాక్స్‌‌‌‌లతో కలిపి)కు అమ్ముతున్నారు. బేస్‌‌‌‌ ప్రైస్‌‌‌‌ రూ. 1.4 కోట్లు కాగా, ట్యాక్స్‌‌‌‌లు రూ. 45 లక్షలు.  తక్కువ ధరతో కూడిన టికెట్లకు కూడా డిమాండ్‌‌‌‌ బాగా పెరిగింది. ఒక్కో టికెట్​ కనీసం లక్ష రూపాయలు పలుకుతోంది.  ఇండియా–కెనడా మ్యాచ్‌‌‌‌ టికెట్లకు కూడా మంచి డిమాండ్ నెలకొంది.