దంచికొట్టిన భారత్.. సౌతాఫ్రికాకు 212 టార్గెట్

దంచికొట్టిన భారత్.. సౌతాఫ్రికాకు 212 టార్గెట్

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20 లో భారత్ దుమ్మురేపింది. సౌతాఫ్రికాకు 212 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది.  టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లుకోల్పోయి  211 పరుగులు చేసింది. భారత యువ  ఒపెనర్ ఇషాన్ కిషన్ దంచికొట్టాడు 48 బంతుల్లో మూడు సిక్సులు, 11 ఫోర్లతో  76 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్  15 బంతుల్లో 23, శ్రేయాస్ అయ్యార్ 27బంతుల్లో 36 పరుగులు చేశారు. చివర్లో   కెప్టెన్ రిషబ్ పంత్ 16 బంతుల్లో 23, హార్దిక్ పాండ్యా 12 బంతుల్లోనే 31 పరుగులతో చెలరేగారు. దీంతో భారత్ 211 పరుగులు చేయగల్గింది. సౌతాఫ్రికా బౌలర్లలో  కేశవ్ మహరాజ్, నార్జ్, పర్నేల్, పిట్రోరియస్ లు తలో ఒక వికెట్ తీశారు.