ఐఎన్ఎస్ ఉదయగిరి, హిమగిరితో..నావికాదళం మరింత బలోపేతం

ఐఎన్ఎస్ ఉదయగిరి, హిమగిరితో..నావికాదళం మరింత బలోపేతం

భారత నావికాదళం కోసం ప్రాజెక్ట్ 17ఏ కింద నిర్మించిన రెండు కొత్త యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి ఆగస్టు 26న విశాఖపట్టణంలో జలప్రవేశం చేయనున్నాయి. ఈ నౌకలు దేశ రక్షణ సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో నిర్మించారు. 

ప్రాజెక్ట్ 17ఏ

ఈ ప్రాజెక్ట్ కింద మొత్తం ఏడు యుద్ధ నౌకలను నిర్మించనున్నారు. వీటిలో నాలుగు ముంబయిలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్), మరో మూడు కోల్​కతాలోని రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ)లో నిర్మించనున్నారు. 

ఐఎన్ఎస్ ఉదయగిరి

విశాఖపట్టణంలోని షిప్ యార్డులో నిర్మించారు. ఆంధ్రప్రదేశ్​లోని ఒక పర్వతం పేరు అయిన ఉదయగిరిని ఈ యుద్ధనౌకకు పెట్టారు. 

ఐఎన్ఎస్ హిమగిరి

కోల్​కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్​లో నిర్మించారు. హిమాలయాల్లోని హిమగిరి పర్వత శ్రేణుల పేరు మీద దీనికి హిమగిరి అనే పేరు పెట్టారు.