గండిమైసమ్మలోని గ్లాండ్ ఫార్మా కంపెనీలో తనిఖీలు

గండిమైసమ్మలోని గ్లాండ్ ఫార్మా కంపెనీలో తనిఖీలు
  •     రూ. 2 కోట్లు విలువచేసే103 కిలోల డ్రగ్ సీజ్

జీడిమెట్ల, వెలుగు : గండిమైసమ్మలోని గ్లాండ్​ఫార్మాస్యూటికల్ కంపెనీలో  మేడ్చల్ ఎక్సైజ్​బృందాలు గురువారం తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో 103.46 కిలోల మిడాజోలం డ్రగ్​పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.2.37 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

సరైన పత్రాలు చూపకపోవడంతో డ్రగ్​ను స్వాధీనం చేసుకుని కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశామని తెలిపారు. డ్రగ్ ను కుత్బుల్లాపూర్​ ఎక్సైజ్ అధికారులకు అప్పగించామని పేర్కొన్నారు.