- రూ. 2 కోట్లు విలువచేసే103 కిలోల డ్రగ్ సీజ్
జీడిమెట్ల, వెలుగు : గండిమైసమ్మలోని గ్లాండ్ఫార్మాస్యూటికల్ కంపెనీలో మేడ్చల్ ఎక్సైజ్బృందాలు గురువారం తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో 103.46 కిలోల మిడాజోలం డ్రగ్పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.2.37 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
సరైన పత్రాలు చూపకపోవడంతో డ్రగ్ను స్వాధీనం చేసుకుని కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశామని తెలిపారు. డ్రగ్ ను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ అధికారులకు అప్పగించామని పేర్కొన్నారు.