
కాజీపేట, వెలుగు: పద్మశ్రీ దివంగత వనజీవి రామయ్య స్ఫూర్తితో వరంగల్ నగరం కాజీపేటకు చెందిన ప్రకాశ్ అనే యువకుడు కోటి విత్తనాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. మంగళవారం సోమిడి ప్రాంతంలో స్థానిక యువకులతో కలిసి కానుగ విత్తనాలు సేకరించారు. ఈ ఏడాది కోటి విత్తనాలు సేకరించి నాటుతామని తెలిపారు.
పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ ను నియంత్రించడంతో పాటు మొక్కల పెంచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్థానికులు మేకల శ్రావణ్ కుమార్, జి.కార్తీక్, కె.సుశాంత్, బి.చంద్రమౌళి, జె.జంపయ్య పాల్గొన్నారు.