కర్దనూర్​లోఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

కర్దనూర్​లోఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

పటాన్​చెరు(గుమ్మడిదల),వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండల పరిధిలోని కర్దనూర్​ గ్రామంలో శుక్రవారం రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆయతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకటరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పాండు, మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి, మాజీ ఉపసర్పంచ్ కుమార్, గౌడ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సుధని ఘనంగా సన్మానించారు.