టీఆర్ఎస్ ధర్నాలో మున్సిపల్ ఛైర్ పర్సన్కు అవమానం

టీఆర్ఎస్ ధర్నాలో మున్సిపల్ ఛైర్ పర్సన్కు అవమానం
  • మహిళా కౌన్సిలర్ల భర్తలు ఆకతాయిల్లా ప్రవర్తించారని చైర్ పర్సన్ కన్నీటి పర్యంతం

భద్రాద్రి కొత్తగూడం జిల్లా:కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వడ్లు కొనుగోలు చేయాలని మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు కొత్తగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో సొంత పార్టీ లీడర్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా మహాలక్ష్మి అవమానానికి గురయ్యారు. మహిళా కౌన్సిలర్ల భర్తలు ఆకతాయిల్లా ప్రవర్తించారని చైర్ పర్సన్ కన్నీటి పర్యంతం అయిన వీడియోలు స్థానికంగా వైరల్ అయ్యాయి. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరసనలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా మహాలక్ష్మితో ఆకతాయిల్లా ప్రవర్తించారు మహిళ కౌన్సిలర్ల భర్తలు.
ఆమెను వెనుక నుంచి బైకులతో ఢీ కొడుతు తనపట్ల అసభ్యకరంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ర్యాలీ చేస్తున్నప్పుడు అగౌరపరిచారని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు మున్సిపల్ చైర్ పర్సన్. వారికి ఎంత చెప్పిన వినకుండా తనతో ఆకతాయిల్లా వ్యవహరించారని కన్నీటి పర్యంతమయ్యారు.తాను ఇబ్బంది పడుతున్నానని, దండం పెడుతూ వేడుకున్న కాని వినకుండా అదే పనిగా ఆమె కాలి భాగాన్ని ఢీ కొడుతు ర్యాలీ కొనసాగించారని వాపోయారు. తనకు జరిగిన అవమానం గురించి  ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని చైర్ పర్సన్ చెబుతున్నారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

ఏపీ పునర్విభజనపై సుప్రీంకోర్టులో ఉండవల్లి పిటిషన్

కమీషన్ల కోసమే బాయిల్డ్ రైస్ పంచాయతీ

మత్తు వదలరా బాబు..సన్మార్గంలో నడవండి