ఏపీ పునర్విభజనపై సుప్రీంకోర్టులో ఉండవల్లి పిటిషన్

ఏపీ పునర్విభజనపై సుప్రీంకోర్టులో ఉండవల్లి పిటిషన్
  • విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
  • కేసు త్వరితగతిన విచారణకు అంగీకారం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన పై  రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. విభజన వ్యవహారంలో నియమ నిబంధనలపై  ఉండవల్లి గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. సామరస్య విభజనకు నిబంధనలు రూపొందించేలా కేంద్రానికి సూచనలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో కొన్ని తప్పులు జరిగాయని, విభజన ప్రక్రియ సరిగా జరగలేదని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ మళ్లీ సవరణ పిటిషన్ వేశారు. 
ఈ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పునర్విభజన నిబంధనల విషయాన్ని చీఫ్ జస్టిస్  ఎన్వీ రమణ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ పిటిషన్ దాఖలు చేసి ఇప్పటికే చాలా కాలం అయిందని న్యాయవాది  ప్రశాంతభూషణ్ గుర్తు చేశారు. ఈయన సూచనను పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ ధర్మాసనం దీనిపై త్వరితగతిన విచారణకు జరిపేందుకు అంగీకరించింది. త్వరగా విచారణ జరిపేందుకు వచ్చేవారం లిస్టులో ఈ పిటిషన్ ను పొందుపరచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు ధర్మాసనం. 

 

ఇవి కూడా చదవండి

కమీషన్ల కోసమే బాయిల్డ్ రైస్ పంచాయతీ

ఏ రాష్ట్రంలో లేని వడ్ల సమస్య ఇక్కడే ఎందుకొచ్చింది?

మత్తు వదలరా బాబు..సన్మార్గంలో నడవండి

రివ్యూ: గని

సర్ఫ్, నూనె, కెమికల్స్​తో పాల తయారీ