ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ ఫీజు తేదీని ప్రకటించింది ఇంటర్ బోర్డు. నేటినుంచి (అక్టోబర్ 26) నవంబర్ 14 వరకు ఎలాంటి లేట్ ఫీ లేకుండా ఎగ్జామ్ ఫీజు చెల్లించవచ్చు. ఇంటర్ వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది (2024 మార్చి) లో నిర్వహించనున్న క్రమంలో విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించాలని ఆయా కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
లేట్ ఫీ తో నవంబర్ 16 నుంచి డిసెంబర్ 20 వరకు ఫీజు చెల్లించే అవకాశంకల్పించింది ఇంటర్ మీడియట్ బోర్డు. నవంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు రూ. 100 ఆలస్య రుసుంతో, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు రూ. 500 లేట్ ఫీజుతో, డిసెంబర్ 6 నుంచి 13 వరకు రూ. 1000 లేట్ ఫీజుతో, డిసెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు రూ. 2 వేల లేట్ ఫీతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.