నిజామాబాద్ లో ఇంటర్​ పరీక్షలు షురూ

నిజామాబాద్ లో ఇంటర్​ పరీక్షలు షురూ

నిజామాబాద్ లో 795 మంది, కామారెడ్డిలో 421  గైర్హాజరు


నిజామాబాద్, వెలుగు: ఇంటర్​ ఫస్టియర్ ​ఎగ్జామ్స్ బుధవారం స్టార్ట్​అయ్యాయి. ​19,117 మంది విద్యార్థులకు గానూ 18,322 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్​ రాశారు. 795 గైర్హాజరయ్యారు. 8 పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్​ స్క్వాడ్స్, 20 సెంటర్లలో ఫ్లైయింగ్ స్క్వాడ్స్​తనిఖీలు నిర్వహించారు. నవీపేట మోడల్ కాలేజ్ ​సెంటర్​లో మాల్​ప్రాక్టీస్​కు పాల్పడుతున్న ఒకరిపై కేసు నమోదైనట్లు జిల్లా ఇంటర్ ​విద్యాధికారి పేర్కొన్నారు.


కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో తొలిరోజు ఇంటర్మీడియెట్​ఫస్టియర్​ఎగ్జామ్స్ ​ప్రశాంతంగా జరిగాయి. 37 సెంటర్లలో పరీక్షలు జరగగా 9750 స్టూడెంట్స్​కు గాను  9,329 మంది అటెండయ్యారు.  421 మంది పరీక్షలు రాయలేదు. జిల్లా కేంద్రంతో పాటు రామారెడ్డి మండల కేంద్రంలోని ఎగ్జామ్​సెంటర్లను కలెక్టర్ జితేశ్​ వీ పాటిల్​ పరిశీలించారు. స్టూడెంట్స్​కు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని ఆఫీసర్లకు సూచించారు. నోడల్​ ఆఫీసర్ ​షేక్ ​సలాం కూడా సెంటర్లను పరిశీలించారు.