హైదరాబాద్ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కోర్సులో ప్రవేశం కోసం అడ్మిషన్ల గడువును పొడిగించారు. ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం చేసిన విజ్ఞప్తి మేరకు అడ్మిషన్ల గడువును నవంబర్ 12వ వరకు పొడిగిస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ, ప్రయివేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, కో ఆపరేటివ్, రెసిడెన్షియల్, టీఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, టీఎస్ గిరిజన సాంఘిక సంక్షేమ, టీఎస్ మోడల్, టీఎస్ బీసీ సంక్షేమ, మైనార్టీ సంక్షేమ, కేజీబీవీ, ప్రోత్సాహక జూనియర్ కాలేజీలతోపాటు రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సులు అందించే కంపోజిట్ డిగ్రీ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశం పొందవచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వివరించారు.
వివరాలకు వెబ్సైట్: www.tsbie.cgg.gov.in.. ఫోన్ నెంబర్: 040-24603314
.