
పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగవైభవంగా జరగాల్సిన పెళ్లిని ఇద్దరు మైనర్లు బొమ్మలాటగా మార్చేశారు. ఇంటర్ చదువుతున్న ఇద్దరు మైనర్లు ఏకంగా తరగతి గదిలోనే పెళ్లి చేసుకున్నారు. ఈ విచిత్ర ఘటన రాజమండ్రిలో వెలుగుచూసింది. రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఓ మైనర్ బాలిక, మైనర్ బాలుడు క్లాస్ రూంనే పెళ్లి మండపంగా మార్చుకున్నారు. క్లాస్ రూంలోనే బాలిక మెడలో మైనర్ బాలుడు మూడు ముళ్లు వేశాడు. ఈ తతంగాన్ని మొత్తం మరో బాలిక వీడియో తీసింది. ఆ వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వారిద్దరికీ టీసీ ఇచ్చి పంపించేశాడు. పిల్లలు చేసిన ఈ పనికి వారిద్దరి కుటుంబాలు తలలు పట్టుకున్నాయి.
For More News..