అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ. 3.5 కోట్ల గంజాయి స్వాధీనం

అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ. 3.5 కోట్ల గంజాయి స్వాధీనం

ఒరిస్సా నుంచి డీసీఎంలో గంజాయి తరలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 3.5 కోట్లు విలువచేసే వేయి కిలోల గంజాయిని పట్టుకున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6 లక్షలు విలువచేసే 50 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 

Also Read :- సైరెన్ వేస్తూ ఓవర్ స్పీడ్

కాగా ఆంధ్రప్రదేశ్ సీలేరు నుంచి గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 లక్షలు విలువచేసే 80 కేజీల గంజాయిని సీజ్ చేశారు ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.