పెద్ద దందానే.. గంజాయి ముఠా గుట్టు రట్టు.. 65 కిలోలు సీజ్

పెద్ద దందానే.. గంజాయి ముఠా గుట్టు రట్టు.. 65 కిలోలు సీజ్

సిటీలో గంజాయి స్మగ్లింగ్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. యువతను టార్గెట్ గా చేసుకుని అంతరాష్ట్ర ముఠాలు రెచ్చిపోతున్నాయి. వేరే రాష్ట్రాలనుంచి గంజాయి తీసుకొచ్చి సప్లై చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

స్మగ్లర్లపై ఓ కన్నేసి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఓ అంతరాష్ట్ర ముఠాను శనివారం (ఏప్రిల్ 29) నాడు హైదరాబాద్ నడిబొడ్డులో పట్టుకున్నారు పోలీసులు. వారి నుంచి రూ.20 లక్షల విలువగల 65 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 

వైజాగ్ లోని అప్పర్ సీలేరు నుండి హైదరాబాద్ మీదుగా గంజాయిని తరలిస్తున్న హర్యాణ రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యాణా రాష్ట్రానికి చెందిన నలుగురు యువకులు  హైదరాబాద్ బోయినపల్లిలో ప్యాకర్స్ అండ్ మూవర్స్ లో పనిచేస్తున్నారు. 

సులభంగా డబ్బులు సంపాదించాలానే దురాలోచనతో ఈ పనిచేసినట్లు పట్టుబడ్డ యువకులు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ అప్పర్ సీలేరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పాటు చేసుకుని.. అక్రమ దందా చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తెలిసింది.