
ముషీరాబాద్, వెలుగు: ఈ నెల 28న ఉప్పల్ భగాయత్లో నిర్వహించే విరాట్ విశ్వకర్మ మహోత్సవానికి హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డికి బీసీ కుల సంఘాల జేఏసీ, ఆత్మగౌరవ కమిటీ చైర్మన్ కుందార గణేశ్చారి ఆహ్వానపత్రిక అందజేశారు. సోమవారం ఆత్మగౌరవ కమిటీ ప్రతినిధులతో కలిసి సీఎం నివాసానికి వెళ్లారు. కార్యక్రమంలో లాల్ కోట వెంకటాచార్యులు, వేములవాడ మదన్మోహన్, సుంకోజు కృష్ణమాచారి, సుంకోజు రమేశ్చారి తదితరులు ఉన్నారు.