మోడీ, జగన్‌లను గెలిపించిన వ్యక్తి.. ఇప్పుడు కేజ్రీవాల్ కోసం..

మోడీ, జగన్‌లను గెలిపించిన వ్యక్తి.. ఇప్పుడు కేజ్రీవాల్ కోసం..

ఢిల్లీలో ఆప్ కోసం పనిచేయనున్నఐపాక్ టీమ్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు సంబంధించిన ఐపాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుకోసం పనిచేస్తుందని ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 2014 ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచించారు. ఆయన ఇప్పుడు ఢిల్లీలో మోడీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ కోసం పనిచేయనున్నారు. ఏపీలో 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఏర్పడటంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతో కీలకం. ఏపీ ఎన్నికల తర్వాత జేడీయూలో చేరిన ప్రశాంత్ కిషోర్ జేడీయూకి జాతీయ ఉపాధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఐపాక్ 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ విజయం కోసం పనిచేస్తోంది.