బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగాడు.37 బంతుల్లో 5 ఫోర్లు,6 సిక్సులతో 68 పరుగులు చేసి ముంబైని ఆదుకున్నాడు.దీంతో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 151 స్కోర్ చేసింది. బెంగళూరుకు 152 లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబైకి మంచి ఓపెనింగ్ దక్కింది. రోహిత్ శర్మ 26, ఇషాన్ కిషాన్ 26 పరుగులతో రాణించారు. తర్వాత వెనువెంటనే ముంబై బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరారు. అపుడు సూర్యకుమార్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ 13తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరు బౌలర్లలో హసన్ రంగ 2, హర్షల్ పటేల్ 2, ఆకాష్ దీప్ ఒక వికెట్ తీశారు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 9, 2022
A 37-ball 68* from @surya_14kumar propels #MumbaiIndians to a total of 151/6 on the board.#RCB chase coming up shortly.
Scorecard - https://t.co/12LHg9xdKY #RCBvMI #TATAIPL pic.twitter.com/TFWeVwrEwG