గ్రాండ్​గా ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ఆరంభం..

గ్రాండ్​గా ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ఆరంభం..

ఐపీఎల్‌‌-17 సీజన్​ అట్టహాసంగా ప్రారంభమైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఓపెనింగ్‌‌ సెర్మనీ ఫ్యాన్స్‌‌ను కట్టి పడేసింది. సోనూ నిగమ్‌‌.. వందేమాతరంతో మొదలైన కార్యక్రమం గంట పాటు కనుల పండువగా సాగింది. బాలీవుడ్‌‌ నటులు అక్షయ్‌‌ కుమార్‌‌, టైగర్‌‌ ష్రాఫ్​ స్టన్నింగ్‌‌ డ్యాన్స్‌‌ పెర్ఫామెన్స్‌‌తో ఫ్యాన్స్​ ఊగిపోయారు. మ్యూజిక్‌‌ మ్యాస్ట్రో, ఆస్కార్‌‌ విజేత ఏఆర్‌‌ రెహమాన్‌‌.. ‘మా తుజే సలాం’, ‘జయహో’, ‘రంగ్‌‌ దే బసంతి’ పాటలతో ఉర్రూతలూగించారు. చివర్లో ఫైర్‌‌ వర్క్స్​తో స్టేడియం జిగేల్‌‌మంది.

చెన్నై: ఆందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–17కు తెరలేచింది. ఎంఎ చిదంబరం స్టేడియంలో జరిగిన ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌ సెర్మనీ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ను కట్టి పడేసింది. సోనూ నిగమ్‌‌‌‌‌‌‌‌.. వందేమాతరంతో మొదలైన కార్యక్రమం గంట పాటు కన్నుల పండుగగా సాగింది. బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ నటులు అక్షయ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, టైగర్‌‌‌‌‌‌‌‌ షాఫ్ర్ స్టన్నింగ్‌‌‌‌‌‌‌‌ డ్యాన్స్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌తో ఫ్యాన్‌‌‌‌‌‌‌‌ ఊగిపోయారు. కొత్తగా రాబోతున్న బడే మియా, చోటే మియాలోని పాటలకు డ్యాన్స్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

ఇక మ్యూజిక్‌‌‌‌‌‌‌‌ మ్యాస్ట్రో, ఆస్కార్‌‌‌‌‌‌‌‌ విజేత ఎఆర్‌‌‌‌‌‌‌‌ రెహమాన్‌‌‌‌‌‌‌‌.. మా తుజే సలాం, జయహో, రంగ్‌‌‌‌‌‌‌‌ దే బసంతితో గూస్‌‌‌‌‌‌‌‌ బంప్స్‌‌‌‌‌‌‌‌ తెప్పించాడు. ఆ తర్వాత మోహిత్‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌.. భల్లే లక్కా, మసక్కలి, ఛయ్య.. ఛయ్యా పాటలతో హోరెత్తించాడు. లేడీ సింగర్లు నీతి మోహన్‌‌‌‌‌‌‌‌.. బర్సోరే సాంగ్‌‌‌‌‌‌‌‌కు శ్వేతా మోహన్‌‌‌‌‌‌‌‌ గొంతు కలిపింది. తర్వాత రెహమాన్‌‌‌‌‌‌‌‌తో కలిసి అందరూ కోరస్‌‌‌‌‌‌‌‌ పాడారు. థీమ్‌‌‌‌‌‌‌‌ షోస్‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకున్నాయి. తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ రోజర్‌‌‌‌‌‌‌‌ బిన్నీ, సెక్రటరీ జై షా, ఆఫీస్‌‌‌‌‌‌‌‌ బేరర్స్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌పైకి వచ్చారు. సోనూ నిగమ్‌‌‌‌‌‌‌‌, రెహమాన్‌‌‌‌‌‌‌‌, అక్షయ్‌‌‌‌‌‌‌‌, జాకీ కూడా అనుసరించారు.