న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ను విడిచి పెట్టి ముంబై ఇండియన్స్తో చేరాడు. ఇందుకు సంబంధించిన ట్రాన్స్ఫర్ను రెండు ఫ్రాంచైజీలు ఆదివారం పూర్తి చేశాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఇందులో భాగం పంచుకుంది. ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కామెరూన్ లీగ్ (రూ. 17.5 కోట్లు)ను ఆర్సీబీకి ట్రేడ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బులతో ముంబై ఇండియన్స్ పాండ్యాను కొనుగోలు చేసింది.
ఇతర ప్లేయర్ల ట్రేడింగ్ లేకుండా ఈ మూడు ఫ్రాంచైజీలు మొత్తం క్యాష్ లావాదేవీల ద్వారానే ఈ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్లను కంప్లీట్ చేశాయి. దీనికి బీసీసీఐ, ఐపీఎల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం ట్రాన్స్ఫర్ విలువ ఎంత అనేది బయటకు వెల్లడి కావడం లేదు. ప్లేయర్ల రిటెన్షన్కు తుది గడవు ఆదివారమే కావడంతో అన్ని ఫ్రాంచైజీలు తమ లిస్ట్లను ప్రకటించాయి.
పాండ్యా, గ్రీన్ను రిటెయిన్ చేసుకున్నట్లు గుజరాత్, ముంబై ఇండియన్స్ ముందుగా తెలిపినా.. కొన్ని గంటల్లోనే ఈ ఇద్దరు తమ ఫ్రాంచైజీలను వదిలిపెట్టి కొత్త వాటితో చేరిపోయారు. పాండ్యా గుజరాత్ను వీడటంతో శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది.