ఐపీఎల్ వేలంలో అపశృతి

ఐపీఎల్ వేలంలో అపశృతి

బెంగళూరు: ఐపీఎల్ వేలంలో అపశృతి చోటుచేసుకుంది. వేలంపాట పాడుతున్న హ్యూజ్ ఎడ్మీడ్స్ ఉన్నట్లుండి కింద పడిపోయాడు. దీంతో అందరూ భయాందోళనలకు లోనయ్యారు. అయితే  నిర్వాహకులు వేలంను ఆపేశారు. అప్పటికి శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ రూ.10.75 కోట్లతో వేలంలో ఉన్నాడు. ఎడ్మీడ్స్ కు నిర్వాహకులు వైద్యసాయం అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. ఆక్షన్ ను తిరిగి 3.30 గంటలకు ప్రారంభిస్తామని అఫీషియల్ బ్రాడ్ కాస్టర్స్ తెలిపారు. 

ఇకపోతే, ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ 2022 వేలంలో భారత స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. ఈ ధనాధన్ ఆటగాడ్ని రూ.12.25 కోట్లు పెట్టి కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాడు. హర్షల్ ను రూ.10.75 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. గత సీజన్ లో ఆర్సీబీ తరఫున 32 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్న హర్షల్ పటేల్ పై నమ్మకం ఉంచిన ఛాలెంజర్స్.. మరోసారి అతడ్ని కొనుగోలు చేసింది. కగిసో రబాడ, శిఖర్ ధవన్, జేసన్ హోల్డర్, నితీశ్ రాణా కూడా మంచి ధర పలికారు. రబాడను రూ.9.25 కోట్లు, శిఖర్ ధవన్ ను రూ.8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. జేసన్ హోల్డర్ ను రూ.8.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్, నితీశ్ రాణాను రూ.8 కోట్లకు కేకేఆర్ దక్కించుకున్నాయి. 

మరిన్ని వార్తల కోసం:

కేసీఆర్.. నిరుద్యోగులు నిన్ను తరమకుండా చూస్కో

భారీ ధరకు అమ్ముడుపోయిన భారత స్టార్ బ్యాట్స్మన్

హిజాబ్ వివాదంపై స్పందించిన విదేశాంగ శాఖ