
పోయిన ఏడాది వరకు ఒక లెక్క.. ఈ ఏడాది ఇంకో లెక్క అన్నీ రీతిలో ఐపీఎల్ 2023 సీజన్ ఉండనుంది. ఈసారి జట్లన్నీ కొత్తగా కనిపించనున్నాయి. చాలా జట్లు తమ కీలక ప్లేయర్లను ఈ సీజన్లో వదిలేశాయి. టీ20 ప్రపంచకప్ లో రాణించిన కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ లో భారీ ధరకు అమ్ముడుపోయారు. పంజాబ్.. శామ్ కరన్ రూ.18.5 కోట్లకు దక్కించుకోగా, బెన్ స్ట్కోక్స్ ను చెన్నై రూ.16.25 కోట్లకు దక్కించుకుంది. పోయిన ఏడాది సన్ రైజర్స్ కెప్టెన్ గా ఉన్న విలియమ్సన్.. ఇప్పుడు గుజరాత్ తరుపున ఆడనున్నాడు. ఢిల్లీకి వార్నర్, సన్ రైజర్స్ కు మార్ క్రమ్, పంజాబ్ కు ధవన్, కోల్ కతాకు నితిష్ రాణా కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.
మళ్లీ ఇంటా, బయటా...
లీగ్ స్టేజ్ లో మ్యాచ్ లన్నీ ఇంటా, బయట విధానంలో జరగడం కొత్తేమీ కాదు. అయితే. 2019 కరోనా తర్వాత ఆ రూల్ ని తీసేశారు. ప్రస్తుతం మళ్లీ ఐపీఎల్ 2023లో ఈ రూల్ ని తీసుకొచ్చారు. ప్రతి జట్టు సొంతగడ్డపై 7 మ్యాచులు, ప్రత్యర్థి మైదానంలో 7 మ్యాచులు ఆడుతుంది. ఈసారి మొత్తం 12 వేదికల్లో ఐపీఎల్ మ్యాచులు జరుగుతాయి. రాజస్థాన్, ధర్మశాల, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్కతా, లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపుర్, మొహాలీలో మ్యాచ్లు జరుగుతాయి.