
జైపూర్: స్లో ఓవర్ రేట్ కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్కు ఫైన్ పడింది. బుధవారం రాత్రి రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత టైమ్లో ఓవర్ల కోటా పూర్తి చేయనందుకు అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించారు.
ప్రస్తుతం టోర్నీలో కేఎల్కు ఇదే తొలి తప్పిదం కావడంతో కేవలం ఫైన్తో సరిపెట్టారు. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ మ్యాచ్ 3 గంటలా 20 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ స్లో ఓవర్ రేట్ కారణంగా ఇటీవల చాలా మ్యాచ్లు నాలుగు గంటలకు పైగా సాగుతుండటంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.