
ఇజ్రాయిల్ దేశం దాడులతో ఇరాన్ మరింత అప్రమత్తం అయ్యింది. ఆరు రోజులుగా ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటి వందల మంది చనిపోయారు..ఆస్తులు ధ్వంసం అయ్యాయి. దేశం అల్లకల్లోలంగా ఉంది. యుద్ధం మరింత తీవ్రంగా మారుతున్న పరిణామాలతో.. ఇరాన్ దేశం కీలక నిర్ణయం తీసుకున్నది.
దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్ చేసింది. VPN సర్వీసులను షెట్ డౌన్ చేసింది. ఇక సెల్ ఫోన్ సిగ్నల్స్ ను సైతం డౌన్ చేసింది. దీంతో మొబైల్స్ పని చేయటం లేదు. టెలి కమ్యూనికేషన్ వ్యవస్థలన్నింటినీ మూసివేసింది ఇరాన్ దేశం. ఇజ్రాయెల్ సైబర్ ఎటాక్స్ చేస్తుండటం కూడా దీనికి కారణం.
మంగళవారం(జూన్ 17 న) ఇరాన్ప్రభుత్వం ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ప్రకటించింది. గ్లోబల్ కనెక్టివిటీని పూర్తిగా తగ్గించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ తో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో కేంద్ర కార్పోరేషన్లు, సైబర్సైబర్ సెక్యురిటీ కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజల సమాచారవ్యవస్థలు, బ్యాంకింగ్ రిలైబిలిటీ, మెడికల్ వంటి పౌర సరఫరాలపై తీవ్ర ప్రభావం పడింది.
►ALSO READ | ఇండియా-పాక్ ఒప్పందంలో మీ ప్రమేయం లేదు.. ట్రంప్కు తేల్చి చెప్పిన ప్రధాని మోదీ
మంగళవారం సాయంత్రం 5:30 గంటల తరువాత ఇరాన్ లోని రెండు ప్రధాన మొబైల్ ఆపరేటర్లు పూర్తిగా నిలిపివేశారు. ఇక WhatsApp, Telegram, Apple/Google App Stores వంటి అన్నీసర్వీసులను బ్లాక్ చేశారు. VPN సర్వీసులు కూడా పూర్తిగా పనిచేయలేదు.
ఇరాన్ ప్రభుత్వం గతంలోకూడా ఇలాగే ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. 2019లో దేశవ్యాప్తంగా నిరసనకారులు వీధుల్లోకి రావడంతో దేశం ఆరు రోజుల పూర్తి బ్లాక్అవుట్ను అమలు చేసింది. ప్రభుత్వం పౌరులపై అణిచివేత చర్యలు తీసుకుంది. దీని ఫలితంగా 100 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది.
2022 లో మహిళల హక్కుల కోసం జరిగిన నిరసనల సమయంలో కూడా సోషల్ మీడియా యాప్లను బ్లాక్ చేసి, ఇంటర్నెట్ను పరిమితంగా అందించారు.