
పాక్ ఆక్రమిత కశ్మీర్ వివాదంలో ఎవరి మధ్యవర్తిత్వాన్ని తాము కోరుకోవటం లేదని యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ తో ప్రధాని మోదీ అన్నారు. బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం జూన్ 17) ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారు మోదీ. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు. ఉగ్రవాదాన్ని ప్రాక్సీ వార్ కింద చూడటం లేదని.. అసలైన యుద్ధం కిందే చూస్తున్నట్లు ట్రంప్ తో చెప్పారు. ఇండియా కాల్పుల విరమణలో యూఎస్ ప్రమేయం లేదని ఈ సందర్భంగా స్పంష్టం చేశారు ప్రధాని మోదీ.
బుధవారం (జూన్ 18) ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి గురించి ట్రంప్ కు ప్రధాని మోదీ వివరించినట్లు చెప్పారు. ఆపరేషన్ సిందూర్, ఆ తర్వాతి పరిణామాలను చర్చినట్లు తెలిపారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.
‘‘జీ7 సదస్సు తర్వాత ప్రధాని మోదీ, ట్రంప్ సమావేశం కావాల్సి ఉంది. అయితే అత్యవసరంగా ట్రంప్ అమెరికా వెళ్లటంతో.. ఫోన్ లో మాట్లాడాల్సిందిగా ట్రంప్ కోరారు. దీంతో ఇద్దరు నేతలు ఫోన్ లో పలు అంశాలపై చర్చించార’’ని మిస్త్రీ తెలిపారు.
‘‘ఇరువురు నేతలు దాదాపు 35 నిమిషాలు చర్చించారు. ఏప్రిల్ 22 పహల్గాం దాడి తర్వాత ప్రధాని మోదీతో ట్రంప్ మాట్లాడటం ఇదే తొలిసారి. పహల్గాం ఘటనపై ఈ సందర్భంగా ట్రంప్ సంఘీభావం ప్రకటించారు. టెర్రరిజంపై భారత్ కు తమ మద్ధతు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ పూర్తి వివరాలను ట్రంప్ కు తెలిపారు ప్రధాని మోదీ’’ అని మిస్త్రీ చెప్పారు.
ట్రంప్ కు మోదీ చెప్పిన కీలక అంశాలు:
- పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అదే విధంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ ద్వంద్వ వైఖరిని ప్రపంచం ముందుంచడంలో భారత్ సక్సెస్ అయ్యింది.
- పాకిస్తాన్ బుల్లెట్ తో దాడి చేస్తే తాము బుల్లెట్ తోనే సమాధానం చెబుతాం. ఆపరేషన్ సిందూర్ పూర్తి కాలేదు. ఉగ్రదాడులను నిజమైన యుద్ధంగా పరిగణిస్తాం
- పీఓకే విషయంలో ఎవరి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించం.. పాక్ అభ్యర్థన మేరకు సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నాం
కెనడా పర్యనటకు వెళ్తున్న మోదీ అమెరికా సందర్శించాలని ఈ సందర్భంగా ట్రంప్ కోరగా.. ముందుగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ మేరకు యూఎస్ కు రాలేనని మోదీ చెప్పారు.
Foreign Secretary Vikram Misri announced that Prime Minister @narendramodi had a telephonic conversation with US President #DonaldTrump, which lasted approximately 35 minutes. During the discussion, PM Modi briefed President Trump about Operation Sindoor. PM Modi clarified that… pic.twitter.com/1RuPVc778V
— DD News (@DDNewslive) June 18, 2025