రైలు టికెట్లు బుక్ చేసుకునే IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) సేవలు నిలిచిపోయాయి. దీంతో రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. డబ్బులు కట్టినా టికెట్లు బుక్ కావడం లేదని వాపోతున్నారు. యాప్ లో కూడా పరిస్థితి ఇలానే ఉంది.
అయితే మెయింటెనెన్స్ నిర్వహణ నేపథ్యంలో నఈ టికెట్ సేవలు అందించలేకపోతున్నట్లుగా ఇండియన్ రైల్వే తెలిపింది. సాంకేతిక సమస్య వెంటనే పరిష్కరిస్తామని IRCTC ట్వీట్ చేసింది.
మరో ట్వీట్లో ప్రయాణికులు అమెజాన్, మేక్మైట్రిప్ వంటి ఇతర B2C ప్లేయర్ల ద్వారా తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని IRCTC తెలిపింది.