ఇండియన్ రిమోట్​ సెన్సింగ్​ (ఐఆర్​ఎస్​)

ఇండియన్ రిమోట్​ సెన్సింగ్​ (ఐఆర్​ఎస్​)

భారతదేశంలో ఐఆర్​ఎస్​ వ్యవస్థ మొదటిసారిగా 1998లో ఐఆర్​ఎస్​–1ఏ ప్రయోగం ద్వారా ప్రారంభమైంది. ఒక వస్తువు నుంచి వచ్చే వికిరణం ఆధారంగా ఆ వస్తువు లక్షణాలను, దూరాన్ని తెలుసుకోవడాన్ని రిమోట్​ సెన్సింగ్​ అంటారు. ఈ ఉపగ్రహాలకు ఉండాల్సిన ప్రధాన లక్షణం రెజల్యూషన్ శక్తి. రెండు దగ్గరగా ఉన్న బిందువులను దూరం నుంచే స్పష్టంగా చూడటాన్ని రిజల్యూషన్​ శక్తి అంటారు. రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహాల్లో సెన్సర్లు సేకరించిన సమాచారాన్ని నేషనల్​ రిమోట్​ సెన్సింగ్​ సెంటర్​కు పంపిస్తారు. రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహాల ద్వారా సేకరించిన సమాచారాన్ని నేషనల్​ నేచురల్​ రిసోర్సెస్​ మేనేజ్​మెంట్​  సిస్టమ్​ నిర్వహిస్తుంది. గ్రామీణ, పట్ఠణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, వాతావరణ సమాచార సేకరణకు, విపత్తుల నిర్వహణకు, రవాణా వ్యవస్థ మెరుగుదలకు ఉపరితల చిత్రీకరణకు ఉపయోగిస్తారు. ఈ ఉపగ్రహాలను 500 – 1500 కి.మీ.ల కక్ష్యలో ప్రవేశపెడుతారు. ఈ ఉపగ్రహాలను ప్రయోగించడానికి పీఎస్​ఎల్వీ నౌకలను ఉపయోగిస్తారు. 
మన దేశంలో రిమెట్​ సెన్సింగ్​ ఉపగ్రహాల్లో ఉపయోగిస్తున్న సెన్సర్లు, స్కానర్లల్లో ముఖ్యమైనవి.

1. లీనియర్ ఇమేజింగ్​ సెల్ప్​స్కానర్​
2. అడ్వాన్స్ డ్​ వైడ్​ఫీల్డ్​ సెన్సర్స్​
3. మాడ్యులర్ ఆప్టో ఎలక్ట్రానిక్​ స్కానర్​
4. ఓసియన్ కలర్​ మానిటర్​ 
5. పాంక్రోమాటిక్​ కెమెరా